ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. రేపు మరో అల్పపీడనం

ABN, First Publish Date - 2020-08-12T12:18:18+05:30

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. రేపు మరో అల్పపీడనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, కర్నూలు, అమరావతి(ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా  ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆతరువాత కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. మంగళవారం ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 14, 15 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మంగళవారం సాయంత్రం జలాశయానికి 1,47,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సుంకేసుల, హంద్రీ నుంచి ఎలాంటి వరద లేదు. 

Updated Date - 2020-08-12T12:18:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising