నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల భారీ ర్యాలీ
ABN, First Publish Date - 2020-02-23T04:35:32+05:30
నూజివీడు ట్రిపుల్ ఐటీలో లేడీస్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
కృష్ణా : నూజివీడు ట్రిపుల్ ఐటీలో లేడీస్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రిపుల్ ఐటీలో భద్రత కరువైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘మా భద్రతకు ముప్పులేదు.. మేం సేఫ్గా ఉన్నాం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఇదిలా ఉంటే.. ట్రిపుల్ ఐటీలో జరిగిన ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కనిపెట్టుకుని ఉండక్కర్లేదా..? అని సిబ్బందిపై మండిపడ్డారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలోనే నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శిస్తానని మంత్రి తెలిపారు.
Updated Date - 2020-02-23T04:35:32+05:30 IST