ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం: బాలకృష్ణ

ABN, First Publish Date - 2020-05-28T14:22:12+05:30

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో బాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లో బాలయ్య నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. అలాగే ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు కూడా చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.


సినీ పెద్దలతో ప్రభుత్వ చర్చలు తెలియవు

సినిమా షూటింగులు ప్రారంభించే విషయంపై సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు తనకు తెలియదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంతో చర్చల విషయం పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జూన్‌లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్‌లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. షూటింగ్‌ సమయంలో సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-28T14:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising