‘నివర్’ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు
ABN, First Publish Date - 2020-11-26T22:15:59+05:30
నివర్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని అచ్చెనాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైసీపీ బాధితుల పట్ట నిర్లక్ష్యం వీడాలని ఆయన అన్నారు.
విజయవాడ: నివర్ తుపాను ధాటికి దక్షిణ కోస్తా, సీమప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయ చర్యలు సకాలంలో అందించాలని టీడీపీ సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడాలని ఆయన అన్నారు.
దక్షిణ కోస్తా, సీమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలని చెప్పారు.
Updated Date - 2020-11-26T22:15:59+05:30 IST