జగన్ కు దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను స్వీకరించాలి: నిమ్మల
ABN, First Publish Date - 2020-08-04T22:24:04+05:30
జగన్ కు దమ్ముంటే చంద్రబాబు సవాల్ ను స్వీకరించాలి: నిమ్మల
పశ్చిమగోదావరి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన కంటే మూడు రాజధానులతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టమన్నారు. ఓటేసిన ప్రజలకు జగన్ నమ్మకద్రోహం చేశారని నిమ్మల రామానాయుడు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే వైసీపీ నేతలు జగన్కు బానిసలుగా మారారని విమర్శించారు. జగన్కు రాజధాని మార్పుపై ప్రజాతీర్పు అడిగే ధైర్యం ఉందా? అని రామానాయుడు ప్రశ్నించారు. జగన్ కు దమ్ముంటే చంద్రబాబు సవాల్ స్వీకరించాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.
Updated Date - 2020-08-04T22:24:04+05:30 IST