ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కలవరంతో నిలిచిన ‘యశ్వంత్‌పూర్‌’

ABN, First Publish Date - 2020-03-23T10:15:29+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ్తయశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తునాడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిట్రగుంట,మార్చి22: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సోకిన ఓ వ్యక్తి ్తయశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణిస్తునాడని కంట్రోల్‌ కాల్‌ బిట్రగుంట రైల్వే అధికారులకు సమాచారం అందటంతో పరుగులు తీశారు. బిట్రగుంట రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫారం 1 లోకి ఆదివారం సాయంత్రం 7.40 గంటల ప్రాంతంలో కోల్‌కత్తా నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఎస్‌-5 బోగీలొ కరోనా అనుమానితులు ఉన్నట్లు రైల్వే అధికారులకు సమాచారం రావడంలో రైలును నిలిపారు. హటాహుటిన రైల్వే వైద్యాధికారిణి హసీనా బేగం, సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స చేశారు.


ఈ వార్త ప్రయాణికులకు తెలియడంతో అందరూ రైలు విడిచి పరుగులు తీశారు. కాగా వైద్యాధికారిణి అధికారులతో మాట్లాడటంతో రైలు బయలుదేరింది. కాగా ఆ బోగిలో ఉన్నది ఇతర దేశానికి చెందిన ఇద్దరు(స్ర్తీ, పురుషులు) కోలకత్తా (హౌరా) నుంచి కేరళకు వెళుతునట్లు తెలిసింది. 31 నిమిషాల పాటు బిట్రగుంటలో నిలిచిన రైలు తరువాత యధావిధిగా కొసాగింది. 

Updated Date - 2020-03-23T10:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising