ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1600 ఎకరాలలో నీటమునిగిన వరిపొలాలు

ABN, First Publish Date - 2020-11-27T06:09:13+05:30

1600 ఎకరాలలో నీటమునిగిన వరిపొలాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, నవంబరు 26 : మండలంలో రెండురోజులపాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోని వరి పొలాలు నీటమునిగాయి. పులికాట్‌ తీరంలోని కటువపల్లి, సింగనాలత్తూరు, కలుజుకండ్రిగ, శ్రీధనమల్లి, తొగరాముడి, కరటాముడి, కారికాడు, గ్రామాల్లో వరిపొలాలు సుమారు 1600 ఎకరాల మేర నీటిలో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అలాగే కాళంగి పరివాహక ప్రాంతాలలో కూడా లోతట్టు ప్రాంతాలలో వరి పొలాలు నీటిలో ఉన్నట్లు వ్యవసాయ అధికారి కాంచన తెలిపారు. తమ సిబ్బందితో కలసి గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. 

జేసీ పర్యటన 

తుఫాన్‌ ప్రభావాన్ని గుర్తించేందుకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మండలంలో గురువారం పర్యటించారు. మండల అధికారులతో కలసి కొత్తపల్లి, నేలపట్టు గ్రామాల్లో పర్యటించారు. కొత్తపల్లిలో సచివాలయాలను తనిఖీ చేశారు. గ్రామస్థులతో తుఫాన్‌ ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నారు. నేలపట్టులో పక్షుల కేంద్రంలో పర్యటించారు. చెరువుకట్లను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఇతరశాఖల అధికారులు ఉన్నారు.


Updated Date - 2020-11-27T06:09:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising