నెల్లూరులో అర్ధరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్య
ABN, First Publish Date - 2020-10-11T15:46:22+05:30
నెల్లూరు : జిల్లాలోని నాలుగోమైలులో నవలాకులతోటలో దారుణం చోటుచేసుకుంది.
నెల్లూరు : జిల్లాలోని నాలుగోమైలులో నవలాకులతోటలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్థరాత్రి ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య నిర్మలమ్మతో పాటు సమీప బంధువు రమణమ్మను భర్త అతికిరాతంగా హత్య చేశాడు. ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఈ జంట హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ జంట హత్యల అనంతరం ఆ వ్యక్తి ఇంటి నుంచి పరారయ్యాడని తెలుస్తోంది. అయితే హత్యకు దారితీసిన కుటుంబ కలహాలేంటి..? ఎందుకిలా చేశాడు..? ఇంటి నుంచి ఎక్కడికి పారిపోయాడు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-10-11T15:46:22+05:30 IST