ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యను కాపురానికి పంపలేదని.. అత్తను హతమార్చిన అల్లుడు

ABN, First Publish Date - 2020-05-14T10:36:18+05:30

భార్యను కాపురానికి పంపలేదనే కసితో అత్తను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎస్‌పేట(నెల్లూరు): భార్యను కాపురానికి పంపలేదనే కసితో అత్తను కిరాతకంగా చంపాడో కిరాతకుడు. ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో బుధవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మేకలబోయిన చిన్నయ్య, పోలమ్మ దంపతుల కుమార్తె దొరసానమ్మను దూబగుంట వాసి సూలా తిరిపాల్‌తో 25 ఏళ్ల క్రితం వివాహం చేశారు. తిరిపాల్‌ మద్యానికి బానిసై భార్యను వేధించడంతో ఏడేళ్ల క్రితం తన పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.


అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం అత్తింటికి వెళ్లి భార్యను పంపించాలని గొడవకు దిగాడు. ససేమిరా అనడంతో కత్తితో అత్త చేయిపై, మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు కత్తితో పరారయ్యాడు. నెత్తుటి మడుగులో ఉన్న తల్లిని చూసి కుమార్తె, కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టేలా చేసింది. ఆత్మకూరు సీఐ పాపారావు, ఏఎస్‌పేట ఎస్సై గోపాల్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-14T10:36:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising