ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7నుంచి వ్యర్థాలపై పోరాటం

ABN, First Publish Date - 2020-12-02T04:24:52+05:30

పారిశుధ్య అభివృద్ధికి ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఈనెల 7 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(జడ్పీ), డిసెంబరు 1 : పారిశుధ్య అభివృద్ధికి ప్రభుత్వం వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఈనెల 7 నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పారిశుధ్య పరిరక్షణపై ప్రజలను చైతన్యపరచడంతోపాటు అందరినీ భాగస్వాములను చేస్తామన్నారు. 7న జిల్లా కలెక్టర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి ర్యాలీ నిర్వహిస్తారన్నారు. 8న మండల కేంద్రాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయన్నారు. 9న గ్రామ పంచాయతీస్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని  పెద్దఎత్తున  నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 10 నుంచి 20వ తేదీ వరకు స్వయంసహాయక సంఘాల లీడర్లు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఎన్జీవోలతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా  గ్రామాల్లో పూర్తిస్థాయిలో పారిశుధ్యం అభివృద్ధికి కృషి జరుగుతుందని ఇళ్ల నుంచే చెత్తను స్వీకరించే కార్యక్రమాన్ని చేపడతామని డీపీవో పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-02T04:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising