భక్తిశ్రద్ధలతో లక్ష బిల్వార్చన
ABN, First Publish Date - 2020-12-04T05:02:56+05:30
కార్తీక మాసం, అరుద్ర నక్షత్రం సందర్భంగా శివాలయాల్లో గురువారం విశేష పూజలు జరిగాయి. మూలస్థానేశ్వరాలయంలో ఉదయం పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమం జరిగాయి.
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 3 : కార్తీక మాసం, అరుద్ర నక్షత్రం సందర్భంగా శివాలయాల్లో గురువారం విశేష పూజలు జరిగాయి. మూలస్థానేశ్వరాలయంలో ఉదయం పాలాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమం జరిగాయి. అనంతరం మూలవర్లకు లక్ష బిల్వార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం విశేష పూలంగిసేవ, ప్రాకారోత్సవం జరిగాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్నాభిషేకం, రాత్రి 7గంటలకు ప్రాకారోత్సవం జరుగుతాయని ఈవో వేణుగోపాల్ తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని సుందరేశ్వరస్వామికి, నవాబుపేట మల్లేశ్వరస్వామి ఆలయం, ఉస్మాన్సాహెబ్పేట కాశీవిశ్వనాఽథస్వామి ఆలయాల్లోనూ అరుద్ర నక్షత్ర పూజలు, కార్తీక మాసోత్సవాలు జరిగాయి.
Updated Date - 2020-12-04T05:02:56+05:30 IST