ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభిమానమే నడిపిస్తోంది!

ABN, First Publish Date - 2020-12-06T03:38:07+05:30

అభిమానులే అండగా ముందుండి నడిపిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు జిల్లాలోని అభిమానులను కొనియాడారు.

వెంకటగిరిలో ప్రసంగిస్తున్న పవన్‌ కల్యాణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గూడూరు, వెంకటగిరిలో పవన్‌ రోడ్‌షో

భారీగా తరలివచ్చిన అభిమానులు

గూడూరు/వెంకటగిరి టౌన్‌, డిసెంబరు 5: అభిమానులే అండగా ముందుండి నడిపిస్తున్నారని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు జిల్లాలోని అభిమానులను కొనియాడారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులు, చేనేత కార్మికులను పరామర్శించడంలో భాగంగా శనివారం ఆయన గూడూరు, వెంకటగిరి పట్టణాల్లో పర్యటించారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద  జాతీయరహదారిపై ప్రవహిస్తున్న నీటిని పరిశీలించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్‌ కేంద్రం వరకూ ర్యాలీగా తరలి వెళ్లారు.  తిప్పవరప్పాడు జనసేన పతాకావిష్కరణ చేశారు.  వెంకటగిరిలో అభిమానులు పూల వర్షంతో స్వాగతం పలికారు.   వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన ప్రసంగిస్తున్నంత సేపూ అభిమానులు చిన్నాపెద్ద తేడా లేకుండా గొడుగులు వేసుకుని ఆసాంతం విన్నారు. అనంతరం ఆయన తిరుపతికి వెళ్లిపోయారు.  జనసేన నాయకులు తీగల చంద్రశేఖర్‌, అల్లం బాబు, నయూం, విజయ్‌, గోవర్థన్‌, కరీముల్లా, కొట్టే వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకులు బైరప్ప, గాలి ప్రకాష్‌నాయుడు, పాలవల్లి మౌనీష్‌, తూపిలి దినకర్‌, చిన్నా, కోటి తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2020-12-06T03:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising