ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యవసర వస్తువుల రవాణా వాహనాలకు పాసులు

ABN, First Publish Date - 2020-03-27T05:53:32+05:30

నిత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఆర్డీవో సరోజిని ద్వారా పాసులను మంజూరు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఆర్డీవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు 

ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య


నాయుడుపేట టౌన్‌, మార్చి 26 : నిత్యవసర సరుకుల రవాణా వాహనాలకు ఆర్డీవో సరోజిని ద్వారా పాసులను మంజూరు చేస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో గురువారం నిత్యవసర దుకాణందారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిత్యవసర సరుకులను అందించేందుకు సంబంధించిన వాహనాలకు పాసులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మీడియాకు కూడా పాసులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆర్డీవో సరోజిని మాట్లాడుతూ నిత్యవసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో నాయుడుపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, తూనికల కొలతల అసిస్టెంట్‌ కంట్రోలర్‌ జీవీ సుబ్బారెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీటీ సంఽధ్యా పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T05:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising