ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రావాల్సిన దాణా బకాయిలు రూ.35 కోట్లు

ABN, First Publish Date - 2020-11-03T09:48:44+05:30

పాడిరైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త పథకాలు లేవని, దాణా కింద ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 35కోట్లు బకాయిలు రావాల్సి ఉందని పశుసంవర్ధకశాఖ జేడీ విజయ్‌మోహన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆరునెలలుగా నిలిచిపోయిన పశునష్టపరిహారం 

 సంత పర్యవేక్షణలో జేడీ విజయ్‌మోహన్‌ 



 మనుబోలు, నవంబరు 2: పాడిరైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కొత్త పథకాలు లేవని, దాణా కింద ప్రభుత్వం నుంచి ఇంకా రూ. 35కోట్లు బకాయిలు రావాల్సి ఉందని పశుసంవర్ధకశాఖ జేడీ విజయ్‌మోహన్‌ తెలిపారు. స్థానిక బీసీ కాలనీలో ఉన్న పశువుల సంతను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన 116ఎద్దుల్లో 13 ఎద్దులకు వైద్యపరీక్షలు చేశామన్నారు. ఎద్దులను అక్రమంగా తీసుకుని వచ్చి ఇతర రాష్ట్రాలకు తరలించడం నేరమన్నారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. ఇక్కడున్న ఎద్దులను గోశాలకు తరలిస్తారా.. కేసులు నమోదు చేసి కోర్టుకు పంపి తరువాత వేలంపాట వేస్తారా ? అన్నది అధికారుల ఆదేశానుసారం చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో పశునష్టపరిహారం కింద రూ. 1.9కోట్లు చెల్లించామన్నారు. ఆరునెలలుగా ఈ పధకం కింద రైతులకు నష్టపరిహారం అందడం లేదన్నారు. ఇప్పటికీ 2వేల పశువులకు నష్టపరిహారం కావాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. దాణా బకాయిలు రూ.50కోట్లు ఉండగా ఇటీవలే రూ.15కోట్లు విడుదల చేశారన్నారు.  కార్యక్రమంలో ఏడీ గురవారెడ్డి, వైద్యులు హర్షకుమార్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T09:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising