నేడు దీపాలు వెలిగించి, రామ భజన చేయండి : వీహెచ్పీ
ABN, First Publish Date - 2020-08-05T11:26:24+05:30
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నందున బుధవారం ఉదయం జిల్లాలోని గృహాలు, ..
నెల్లూరు (సాంస్కృతికం) ఆగస్టు 4 : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నందున బుధవారం ఉదయం జిల్లాలోని గృహాలు, దుకాణాలు, ఫ్యాక్టరీల్లో శ్రీరామ చిత్రపటాలు ఉంచి, దీపాలు వెలిగించి రామ భజన చేయాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) జిల్లా కార్యదర్శి మిద్దె శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మందిరానికి ప్రధాని నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ భూమి పూజ కోసం జిల్లాలోని పుణ్యక్షేత్రాలైన రంగనాథస్వామి, జొన్నవాడ, నరసింహకొండ, ఇరుకళల పరమేశ్వరి, ఘటిక సిద్ధేశ్వరం తదితర క్షేత్రాల నుంచి మట్టి, నీరు సేకరించడమేకాక సముద్రజలాలను కూడా అయోధ్యకు పంపామని ఆయన తెలిపారు. ఎన్నో దశాబ్దాల నాటి హిందువుల కల నేడు నిజం అవుతున్న వేళ అందరూ ఇంటింటా దీపాలు వెలిగించి, రామ భజన చేయాలని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2020-08-05T11:26:24+05:30 IST