ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విధానాలతో డెల్టా రైతులకు కష్టాలు

ABN, First Publish Date - 2020-12-16T03:49:59+05:30

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో డెల్టా రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు.

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని సన్మానిస్తున్న టీడీపీ కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి



కోవూరు, డిసెంబరు 15: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో డెల్టా రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల్ని ఇబ్బందులకు గురిచేసి అధికార వైసీపీ నాయకులు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. చారిటబుల్‌ ట్రస్టు పేరుతో లక్షలాది రూపాయల్ని కొల్లగొట్టారని విమర్శించారు. రైతులెవ్వరూ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో తుగ్లక్‌పాలన సాగుతోందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను కోర్టులు తిరస్కరించాయని చెప్పారు. రూ.పదివేల కోట్లతో అమరావతి ప్రజానిధుల్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి అధ్యక్షత వహించిన సభలో నాయకులు సన్నపురెడ్డి వేణుగోపాలరెడ్డి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, బాలా రవి, ముసలి సుధాకర్‌, గౌతమ్‌, మునిరత్నం, జెట్టి రాజగోపాలరెడ్డి, నరేంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

Updated Date - 2020-12-16T03:49:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising