ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-16T03:51:51+05:30

కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పిట్టా వెంకమ్మ (81) అనే వృద్ధురాలు మంగళవారం పాతూరు జొన్నాయగుంటలోని హైమానగర్‌లో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిరూరల్‌, డిసెంబరు 15: కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పిట్టా వెంకమ్మ (81) అనే వృద్ధురాలు మంగళవారం పాతూరు జొన్నాయగుంటలోని హైమానగర్‌లో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. జలదంకి మండలం రామవరప్పాడుకు చెందిన వెంకమ్మకు ఐదుగురు సంతానం ఉన్నా గ్రామంలో ఒంటరిగానే నివశిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆమె ఇంట్లోకి నీరు చేరిందని గ్రామస్థులు ఆమె కుమారుడు మాల్యాద్రికి చెప్పటంతో ఆయన వారం క్రితం తన తల్లిని కావలిలోని తన ఇంటికి తీసుకువచ్చాడు. మంగళవారం తల్లిని చూడడానికి వచ్చిన ఆమె కుమార్తెకు కుమారుడికి గొడవ జరగటంతో మనస్థాపం చెందిన వెంకమ్మ చేతికర్ర సహాయంతో హడావుడిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేలోపే కుమారుడి ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి మృతి చెందింది. సమాచారం అందుకున్న 1వ పట్టణ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కొండయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికితీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-16T03:51:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising