ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులకు అన్యాయం చేస్తే పుట్టగతులు ఉండవు

ABN, First Publish Date - 2020-12-18T04:22:09+05:30

అమరావతి రైతులకు అన్యాయం చేసినవారికి పుట్టగతులు ఉండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు.

సూళ్లూరుపేటలో ర్యాలీ చేస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల 

సూళ్లూరుపేట, డిసెంబరు 17 : అమరావతి రైతులకు అన్యాయం చేసినవారికి పుట్టగతులు ఉండవని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. అమరావతి రైతుల పోరాటానికి 365 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన సూళ్లూరుపేటలో  నేతలు, కార్యకర్తలతోకలసి  ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పురవీధుల్లో రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలతో కలసి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతుపై వాన కురిసినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో  రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని అనేకసార్లు చర్చలకు పిలిచిందన్నారు.  ఇక్కడ 365 రోజులుగా అలుపెరగకుండా రైతులు పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు.  కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మన శ్రీధర్‌, నాయకులు తిరుమూరు సుధాకర్‌రెడ్డి, ఆకుతోట రమేష్‌, జి. శంకరయ్య, ఎం .సాయి,  సీ. పెరుమాల్‌, మెస్‌ రమణయ్య, కె. పెంచలయ్య, శ్రీనివాసులునాయుడు, సురే్‌షనాయుడు, పూడి సెల్వం, శివాజీ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T04:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising