హోంగార్డు ఆత్మహత్య
ABN, First Publish Date - 2020-11-30T04:32:07+05:30
ఉదయగిరి పోలీ్సస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బకీరు దుర్గాప్రసాద్ (30) తలకు రాసుకొనే ద్రావణం తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయగిరి రూరల్, నవంబరు 29: ఉదయగిరి పోలీ్సస్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బకీరు దుర్గాప్రసాద్ (30) తలకు రాసుకొనే ద్రావణం తాగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల మేరకు.. కుటుంబ కలహాల కారణంగా దుర్గాప్రసాద్ మనస్తాపం చెంది శనివారం రాత్రి స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమీపంలో తలకు రాసుకొనే ద్రావణం తాగాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సమాచారం అందించాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన అక్కడ చేరుకొని అతనిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆత్మకూరు, అక్కడ నుంచి నెల్లూరుకు తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని ఉదయగిరి సీఐ ప్రభాకరరావు, ఎస్ఐ మరిడినాయుడు, పోలీసు సిబ్బంది, హోంగార్డులు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2020-11-30T04:32:07+05:30 IST