వేములచేడు చెరువుకు గండి
ABN, First Publish Date - 2020-12-05T03:42:45+05:30
మండల పరిధిని వేములచేడు గ్రామ చెరువుకు గండి పడింది.
గండిని పరిశీలిస్తున్న తహసీల్దార్ జయజయరావు
సైదాపురం, డిసెంబరు 4: మండల పరిధిని వేములచేడు గ్రామ చెరువుకు గండి పడింది. తహసీల్దార్ జయజయరావు అక్కడికి చేరుకుని ఇసుక బస్తాలతో గండిని పూడ్చి వేసే చర్యలు చేపట్టారు. తురిమెర్ల గ్రామం వద్ద పిన్నేరువాగు ఉదృత్తంగా ప్రవహించడంతో సైదాపురం-పొదలకూరు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు నీరు పూర్తిగా చేరి కలుజులు పారుతున్నాయి. వర్షాల వల్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - 2020-12-05T03:42:45+05:30 IST