రైల్వే డీఎస్పీగా మురళీకృష్ణ బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2020-11-29T05:17:47+05:30
నెల్లూరు రైల్వే డీఎస్పీగా టి. మురళీకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు(క్రైం)నవంబరు 28: నెల్లూరు రైల్వే డీఎస్పీగా టి. మురళీకృష్ణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రైల్వే డీఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ వసంతకుమార్ ఈ ఏడాది జూన్లో ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం తిరుపతి రైల్వే డీఎస్పీ ఎస్ఎం రమే్షబాబు ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉద్యోగోన్నతుల్లో గుంటూరు రేంజ్ పరిధిలో వీఆర్లో ఉన్న టి. మురళీకృష్ణ డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది నెల్లూరు రైల్వే డీఎస్పీగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు నెల్లూరు రైల్వే సీఐ కె. శ్రీనివాసాచారి, ఎస్ఐలు సిరాజుద్దీన్, వెంకయ్య, మాలకొండయ్య తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మురళీకృష్ణ 1991 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు. ఎస్ఐగా, సీఐగా మంగళగిరి, తెనాలి, గుంటూరు, అమరావతి, కావలి రూరల్ ప్రాంతాల్లో పని చేశారు.
Updated Date - 2020-11-29T05:17:47+05:30 IST