అలరించిన క్రిస్మస్ గానలహరి
ABN, First Publish Date - 2020-12-16T05:19:56+05:30
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన క్రిస్మస్ గానలహరి శ్రోతల్ని అలరింపచేసింది.
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 15 : క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన క్రిస్మస్ గానలహరి శ్రోతల్ని అలరింపచేసింది. కస్తూరిదేవి విద్యాలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుకలు సింహపురి అసోసియేట్స్ ఇన్ క్రిస్ట్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్, ఏఎంసీ చైర్మన్ ఏసునాయుడు హాజరయ్యారు. క్రీస్తు సందేశం, దైవ ప్రార్థనలు జరిగాయి. అనంతరం క్యాండిల్ లైట్ సర్వీసు కనువిందు చేసింది. పాటల పోటీల విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ కళాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ దయాసాగర్, అరుణకుమార్, బ్రదర్జానీజో, విద్యాధర్, మహేష్బాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-16T05:19:56+05:30 IST