విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు
ABN, First Publish Date - 2020-11-28T05:12:19+05:30
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరు గ్రామంలో తమ విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ శుక్రవారం ఎనిమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూళ్లూరుపేట, నవంబరు 27 : సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరు గ్రామంలో తమ విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ శుక్రవారం ఎనిమిది మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామంలోని దళితవాడలో నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నట్లు ఐదు కుటుంబాల వారు తెలియజేయడంతో జేసీబీ పంపి నీరు వెళ్లిపోయేలా కాలువ తవ్వించేందుకు ప్రయత్నిస్తుంటే 8 మంది అడ్డుపడి పనిచేయనీయకుండా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-11-28T05:12:19+05:30 IST