ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరిపైరును ముంచిన ‘బురేవి’

ABN, First Publish Date - 2020-12-04T04:53:24+05:30

నివర్‌ తుఫాన్‌ నుంచి కోలుకోకముందే మరో తుఫాన్‌ బురేవి రైతులను దెబ్బతీసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, డిసెంబ రు 3 : నివర్‌ తుఫాన్‌ నుంచి కోలుకోకముందే మరో తుఫాన్‌ బురేవి రైతులను దెబ్బతీసింది. ఇప్పటికే పైర్లు జలమయం కావడంతో అనేక మంది రైతులు  తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో బురేవి ప్రభావంతో గురువారం కురిసిన వర్షంతో తుమ్మూరు, పండ్లూరు, అన్నమేడు, ద్వారకాపురం, అరవపెరిమిడి, కాపులూరు, కూచివాడ తదితర గ్రామాల్లో వరిపైరు నీట మునిగింది. మండలంలో 4,650 హెక్టార్ల వరిసాగు చేపట్టారు. వరినాట్లు వేసి 25-35 రోజులవుతోంది. రైతులు దుక్కి, నాట్లు, అడుగుమందు తదితరాలకుగాను ఎకరాకు చేసిన రూ. 15వేల  ఖర్చు వర్షం పాలైంది. దాదాపు 30 రోజుల వరిపైరు నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అలాగే 80శాతం దెబ్బతిన్న  పైరు నష్టాలను అధికారులు అంచనావేస్తున్నారు. గతంలో హెక్టారు నష్టానికి  15వేలు, ఎకరాకు 6వేలు వంతున అందజేశారు. ఈ ఏడాది నష్టపరిహారంపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు  చేయలేదు. తగిన పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2020-12-04T04:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising