భారత్ బంద్ను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2020-12-06T03:26:09+05:30
రైతులను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 8న రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.
గూడూరు(రూరల్), డిసెంబరు 5: రైతులను సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిసెంబరు 8న రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారత్ బంద్ను విజయవంతం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కేశవులు, మణి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T03:26:09+05:30 IST