అవమానించినా.. కొట్టినా రాజధాని వాసులు సహనం కోల్పోలేదు: లోకేష్
ABN, First Publish Date - 2020-03-26T16:45:38+05:30
అమరావతి: జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి: జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులని అవమానించినా.. లాఠీ దెబ్బలు కొట్టినా రాజధాని గ్రామాల ప్రజలు సహనం కోల్పోదని కొనియాడారు.
‘‘జై అమరావతి ఉద్యమం 100 రోజులకు చేరుకుంది. పెయిడ్ ఆర్టిసులని అవమానించినా, లాఠీ దెబ్బలు కొట్టినా... వేల మందిని జైలుకి పంపినా సహనం కోల్పోలేదన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అమరావతిని కాపాడుకోవడానికి ముందుకొచ్చిన రైతులు, మహిళలకి ఉద్యమ వందనాలు’’ అని లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.
Updated Date - 2020-03-26T16:45:38+05:30 IST