ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొన్న సబ్బం హరి ఇల్లు.. ఇవాళ గీతం వర్సిటీ: నారా లోకేశ్

ABN, First Publish Date - 2020-10-24T16:29:36+05:30

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూల్చివేతల రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూల్చివేతల రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుందని, జగన్ రెడ్డికి విధ్వంసం కిక్ ఇస్తుందని ట్వీట్ చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకు పరాకాష్ట అన్నారు. కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రని, ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి, ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీపై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారని ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మొన్న మాజీ ఎంపీ సబ్బం హరి ఇల్లు, ఇవాళ గీతం యూనివర్సిటీ అని ట్వీట్ చేశారు. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డని విమర్శించారు. విశాఖలో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యమని లోకేశ్ అన్నారు. 



Updated Date - 2020-10-24T16:29:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising