తిన్నవి స్నాక్సా? కరెన్సీ నోట్లా జగన్రెడ్డీ..: లోకేష్
ABN, First Publish Date - 2020-07-09T22:31:26+05:30
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఖర్చుల విషయాన్ని
అమరావతి : ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఖర్చుల విషయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. గురువారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రమాణ స్వీకార ఖర్చుల వ్యవహారాన్ని లేవనెత్తిన ఆయన పూర్తి వివరాలతో సహా పంచుకోగా టీడీపీ, వైసీపీ వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
స్నాక్సా.. కరెన్సీ నోట్లా..!?
‘డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు. సీఎం ఒక మీటింగ్లో తాగిన వాటర్బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు ఖరీదు అక్షరాలా 43.44 లక్షలు. ఒక్కరోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయ్యుండాలి.. లేదంటే స్కామైనా చేసుండాలి. ఏడాది క్రితం జగన్రెడ్డి ప్రమాణస్వీకారం రోజున వాటర్ బాటిల్స్, స్నాక్స్కి 59.49 లక్షలు బిల్లు అయ్యిందట! తిన్నవి స్నాక్సా? కరెన్సీ నోట్లా జగన్రెడ్డి గారూ’ అని పూర్తి వివరాలతో సహా నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
Updated Date - 2020-07-09T22:31:26+05:30 IST