ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణ కార్మికులను ఆదుకోండి: జగన్‌కు లోకేష్ లేఖ

ABN, First Publish Date - 2020-04-25T20:52:12+05:30

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్ధిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్ధిక సాయం చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో 50లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఈ ఏడాది తొలుత ఇసుక సమస్య కారణంగా భవన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా లాక్ డౌన్ వల్ల పూట గడవని దుర్భర జీవితం గడుపుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 


నూతన ఇసుక విధానం వలన ఉపాధి లేక, కుటుంబాలను పోషించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో కలచి వేసిందన్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ వారిని మరింత దెబ్బతీసిందన్నారు. కార్మికులకు అందుబాటులో ఉన్న 1900కోట్ల బిల్డింగ్ సెస్ వారి సంక్షేమానికే ఖర్చు చేయాలన్నారు. చంద్రన్న బీమాను పునరుద్ధరించటంతో పాటు వారి జీవన భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.


Updated Date - 2020-04-25T20:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising