‘కొడాలి నానీని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’
ABN, First Publish Date - 2020-09-24T21:09:19+05:30
మంత్రి కొడాలి నానిని పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన సమయం వచ్చిందని..
అమరావతి: మంత్రి కొడాలి నానిని పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన సమయం వచ్చిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వరరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మతాలమధ్య చిచ్చురేపుతున్న నానీ హిందువా... లేక పాకిస్తాన్ వాడా? అని ప్రశ్నించారు. దేవుళ్లను బొమ్మలు.. రథాలను చెక్కలతో పోలుస్తున్న మంత్రిని పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. ముఖ్యమంత్రి మెప్పుకోసమే ఆయన హిందూమతాన్ని కించపరుస్తున్నారని, డబ్బు, అధికారమదంతోనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొడాలిని తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకుంటే ముఖ్యమంత్రి అండతోనే నానీ మాట్లాడుతున్నారని ప్రజలంతా భావించాల్సి ఉంటుందన్నారు.
మతాల మధ్య చిచ్చురేపుతూ, దేవుళ్లను బొమ్మలతో, చెక్కలతో పోలుస్తున్న కొడాలి నాని అసలు హిందువా... లేక పాకిస్తాన్ వ్యక్తా అన్న సందేహం కలుగుతోందని నాగ జగదీశ్వరరావు అన్నారు. “దుర్గగుడిలో సింహపు ప్రతిమలు మాయమైతే, ఏంపోయింది... వాటి ఖరీదు రూ. 6, 7 లక్షలేకదా” అనడం, అంతర్వేదిలో రథం దగ్ధమైతే, “కోటిరూపాయలు ఇస్తున్నాం కదా” అంటూ ఏదిపడితే అది మాట్లాడుతున్న నానీని తక్షణమే పిచ్చాసుపత్రిలో చేర్చాలన్నారు. డబ్బు, అధికారం మదంతోనే నానీ నోటికి పనిచెబుతున్నాడని, అటువంటి వ్యక్తి ప్రజలమధ్యన ఉంటే ప్రమాదమన్నారు. కొడాలినానీ లాంటి వారు మంత్రివర్గంలో ఉంటే జగన్కే నష్టమని జగదీశ్వరరావు వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-09-24T21:09:19+05:30 IST