రాజ్నాథ్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ రఘురాజు
ABN, First Publish Date - 2020-08-09T18:57:17+05:30
కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు.
న్యూ ఢిల్లీ : కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్ సింగ్కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నాడు రాజ్నాథ్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలతో తనకు భద్రత కల్పించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. ఎంపీకి కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రత కల్పించిన విషయం తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ రఘురామ కేంద్రానికి ఫిర్యాదు చేయగా.. దీనిపై స్పందించిన కేంద్రం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. ఈ కేటరిగిలో సుమారు 10 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు.
Updated Date - 2020-08-09T18:57:17+05:30 IST