శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
ABN, First Publish Date - 2020-02-20T15:28:15+05:30
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
తిరుమల: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్సీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో ఎక్కడ చూసినా ఆందోళనలే జరుగుతున్నాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తూన్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు.
Updated Date - 2020-02-20T15:28:15+05:30 IST