ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్ జగన్ గట్స్ ఉన్న నాయకుడు : ఎమ్మెల్యే వాసుపల్లి

ABN, First Publish Date - 2020-09-19T23:07:43+05:30

విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్‌ సమక్షంలో వాసుపల్లి కుమారులు వైసీపీలో చేరారు. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి ఆయన మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు.


జగన్‌కి గిఫ్ట్‌ ఇస్తాం..!

నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. గట్స్ ఉన్న నాయకుడిగా జగన్ కనిపించారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది జగన్‌ ధైర్యమే. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరుతున్నాయి. టీడీపీ ఇక ముందుకు వస్తుందని నాకు అనిపించడం లేదు. విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఇచ్చిన ఘనత జగన్‌ది. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి జగన్‌కి గిఫ్ట్‌ ఇస్తాంఅని వాసుపల్లి గణేష్‌ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-09-19T23:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising