అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ
ABN, First Publish Date - 2020-07-06T01:04:45+05:30
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ తగిలింది. సొంత ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు నిలదీశారు. సీఎం జగన్ ఎక్కడికక్కడ స్థలాలు
విజయవాడ: అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబుకు నిరసన సెగ తగిలింది. సొంత ఊరికి దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు నిలదీశారు. సీఎం జగన్ ఎక్కడికక్కడ స్థలాలు కేటాయించాలని చెప్పినా.. అధికారులు 5 ఊళ్ల అవతల స్థలాలు ఇవ్వడంపై లబ్ధిదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగాయలంక వద్ద ఉన్న స్థలాలను వేరే గ్రామాలవారికి కేటాయించి.. తమను దూరంగా వెళ్లమనడం ఏంటని మహిళలు నిలదీశారు. గ్రామానికి దగ్గరలో స్థలాలు అమ్మేవారు లేకపోవడంతో అక్కడ కేటాయించాల్సి రమేష్బాబు వచ్చిందన్నారు.
Updated Date - 2020-07-06T01:04:45+05:30 IST