ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

ABN, First Publish Date - 2020-12-10T23:10:00+05:30

జిల్లాలో 33 మండలాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలో 33 మండలాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ నిరంకుశ విధానాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మండిపడ్డారు. తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.   నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్‌పుట్‌  సబ్సిడీ కోసం 'రైతు కోసం' పేరుతో పోరాటం చేస్తామని చెప్పారు. 


నియోజకవర్గ స్థాయిలో ఆందోళనలు:  కాలవ శ్రీనివాసులు

ఈ క్రాప్ బుకింగ్‌లోని  రైతుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రకటించాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు.  గతంలో ఇన్సూరెన్స్ రాని మండలాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని కోరారు.   రైతుల తరఫున టీడీపీ పోరాడుతుందని చెప్పారు. టీడీపీ నిరసనలు చేపడితేనే రూ.500 కోట్లు చెల్లించారని అన్నారు. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-10T23:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising