ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంలేదు: వైసీపీ ఎంపీ

ABN, First Publish Date - 2020-07-01T18:52:39+05:30

పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పార్లమెంట్‍కు వెళ్లాలన్న తన చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి కార్యదర్శికి అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రిగా ఏడాది కాలం సంతృప్తిగా పనిచేసినట్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నా. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.’’ అని చెప్పారు. ఇక రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై స్పందిస్తూ.. ఎంపీలు ఎవరైనా పార్టీకి విధేయులుగా ఉండాలని సూచించారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాలని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-01T18:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising