ఇదేమీ ఫ్యాక్షన్ ప్రాంతం కాదు
ABN, First Publish Date - 2020-06-23T09:21:41+05:30
ఇదేమీ ఫ్యాక్షన్ ప్రాంతం కాదు
రఘురామరాజుకు భద్రత ఇస్తాం: మంత్రి
ఏలూరు, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఇదేమీ ఫ్యాక్షన్ ప్రాంతం కాదు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎవరికీ భయపడనక్కర లేదు. తగినంత భద్రత సమకూరుస్తాం’’ అని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎవరికి భద్రత కావాలన్నా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు.
Updated Date - 2020-06-23T09:21:41+05:30 IST