జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ సమీక్ష
ABN, First Publish Date - 2020-08-10T18:44:59+05:30
అమరావతి: జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ సమీక్ష నిర్వహించారు.
అమరావతి: జలవనరుల క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్ సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలుగొండ, అవుకు ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి అనిల్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులను అడిగి మంత్రి అనిల్ వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తికి అన్ని వనరులు సమీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరద పరిస్థితిని అంచనా వేసి నిర్మాణ పనులు చేపట్టాలని సూచనలు చేశారు.
Updated Date - 2020-08-10T18:44:59+05:30 IST