చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ABN, First Publish Date - 2020-10-02T00:46:23+05:30
చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సీఆర్డీఏ ఆఫీసులో మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు సమావేశం
విజయవాడ: చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సీఆర్డీఏ ఆఫీసులో మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు సమావేశం అయ్యారు. చెరకు రైతులు, పంట రవాణా, చెల్లింపులపై మంత్రులు చర్చించారు. ఫ్యాక్టరీలలో మరమ్మతులు చేసి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నాకే క్రషింగ్ చేయాలని బొత్స అన్నారు. చెరకును ఏటికొప్పాకకు తరలించడంపై రైతులు సుముఖంగా లేకపోవడంపై కారణాలు తెలుసుకున్నట్లు కన్నబాబు తెలిపారు.
Updated Date - 2020-10-02T00:46:23+05:30 IST