పెళ్లి చేసుకున్న 3 నెలలకే అత్యంత కిరాతకంగా...
ABN, First Publish Date - 2020-08-22T21:46:38+05:30
జిల్లాలో పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. వివాహం చేసుకున్న మూడు నెలలకే కట్టుకున్న భార్యను ఆమె భర్త అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కడప: జిల్లాలో పులివెందులలో దారుణం చోటు చేసుకుంది. వివాహం చేసుకున్న మూడు నెలలకే కట్టుకున్న భార్యను ఆమె భర్త అత్యంత కిరాతకంగా కడతేర్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ అనే వ్యక్తి వీరమ్మ అనే యువతిని 3 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం అయినప్పటి నుండి అశోక్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా వీరమ్మను చంపేసి పులివెందులలోని శిల్పారామం దగ్గర పూడ్చిపెట్టారు. మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగుచూసింది. శవాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు అశోక్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Updated Date - 2020-08-22T21:46:38+05:30 IST