స్పీకర్ తమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీజేకు లేఖ
ABN, First Publish Date - 2020-07-08T21:26:46+05:30
స్పీకర్ తమ్మినేని సీతారాంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీజేకు ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్నాయుడు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణ కింద
అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీజేకు ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్నాయుడు లేఖ రాశారు. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్పై సుమోటో విచారణకు లేఖలో విజ్ఞప్తి చేశారు. కోర్టులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే.. ప్రభుత్వమెందుకు.. ప్రజలెందుకు.. ఎన్నికలెందుకు అని సీతారాం వ్యాఖ్యానించి కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘ఈ విధంగా చేయి.. నువ్విక్కడకు వెళ్లు.. ఇది స్టాప్ చేయి.. అని చెబుతుంటూ ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు... ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టం ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? భారత రాజ్యాంగం మనకు స్పష్టమైన వ్యవస్థలనిచ్చింది’’ అని తమ్మినేని వ్యాఖ్యానించారు.
Updated Date - 2020-07-08T21:26:46+05:30 IST