నంద్యాలలో ఇద్దరు లాయర్ల మధ్య ఘర్షణ, ఒకరికి తీవ్రగాయాలు
ABN, First Publish Date - 2020-06-07T03:52:04+05:30
నంద్యాలలో ఇద్దరు లాయర్ల మధ్య ఘర్షణ, ఒకరికి తీవ్రగాయాలు
కర్నూలు: నంద్యాలలో ఇద్దరు లాయర్ల మధ్య వకాల్తా విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. లాయర్ సుబ్బరాయుడుపై లాయర్ తులసిరెడ్డి, అతని అనుచరులు కర్రలతో చితకబాదారు. సుబ్బరాయుడుకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లాయర్ తులసిరెడ్డి ఆఫీసు వద్ద లాయర్ సుబ్బరాయుడు బంధువులు ఆందోళనకు దిగారు. ఇద్దరు లాయర్లు టుటౌన్ పోలీసు స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
Updated Date - 2020-06-07T03:52:04+05:30 IST