భూమి ధరల్లో వ్యత్యాసాల పరిశీలనకు కమిటీ
ABN, First Publish Date - 2020-08-11T08:57:34+05:30
పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ ధరలు అమలులోకి వచ్చాయి. మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా
పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూమి విలువ ధరలు అమలులోకి వచ్చాయి. మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. దీని పరిశీలనకు ఓ కమిటీని నియమించింది. ఇప్పటికే వెబ్సైట్ ద్వారా రెవెన్యూశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, రాష్ట్రవ్యాప్తంగా 10% నుంచి 30% వరకు భూముల రిజిస్ర్టేషన్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడ, గుంటూరులో 10%, విశాఖపట్నంలో 25%, అనంతపురంలో 30% మేర విలువలను పెంచింది. ఈ రిజిస్ర్టేషన్ చార్జీలు స్థిరంగా ఉంటాయని, తద్వారా రూ.800కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
Updated Date - 2020-08-11T08:57:34+05:30 IST