అద్భుతంగా పని చేశారు
ABN, First Publish Date - 2020-05-20T10:39:51+05:30
కరోనా నివారణకు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు, సిబ్బంది అద్భుతంగా
అధికారులకు సీఎం ప్రశంస
కర్నూలు, మే 19(ఆంధ్రజ్యోతి): కరోనా నివారణకు కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం అన్ని జిల్లాల కలెక్లర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశావర్కర్లు, వైద్యులు, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, పారిశుధ్య కార్మికులు కలిసి కట్టుగా పనిచేశారని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి పథకాల క్యాలెండర్, ఖరీఫ్ సాగుకు విత్తనాలు, ఎరువులు, ఉపాధి పనులు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, వేసవి తాగునీటి ప్రణాళిక, నాడు-నేడు పనులు, ఇంటి పట్టాలు, ఇసుక, మద్యం తదితర అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్, జేసీలు రవిపట్టన్ శెట్టి, రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, ఎస్పీ, ట్రైనీ కలెక్టర్ విధేకర్, నగరపాలిక కమిషనర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-05-20T10:39:51+05:30 IST