శ్రీశైల దేవస్థాన అక్రమార్కులను సస్పెండ్ చేశాం: ఈవో
ABN, First Publish Date - 2020-06-05T11:06:54+05:30
శ్రీశైల దేవస్థానంలో టికెట్ల కౌంటర్లలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ..
కర్నూలు, జూన్ 4(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలో టికెట్ల కౌంటర్లలో అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో రామారావు తెలిపారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించామన్నారు. కరోనా వైరస్ ఎదుర్కొనేలా ఆలయ ఉద్యోగులకు శిక్షణనిచ్చామన్నారు.
Updated Date - 2020-06-05T11:06:54+05:30 IST