తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడిగా ఆదిశేషారెడ్డి
ABN, First Publish Date - 2020-12-11T05:32:15+05:30
కర్నూలు లోక్సభ తెలుగురైతు జిల్లా అధ్యక్షుడిగా పెద్దహరివాణం ఆదిశేషారెడ్డిని గురువారం టీడీపీ అధినాయత్వం నియమించింది.
నారా లోకేష్ నుంచి నియామక పత్రాన్ని అందుకుంటున్న ఆదిశేషారెడ్డి
ఆదోని, డిసెంబరు 10: కర్నూలు లోక్సభ తెలుగురైతు జిల్లా అధ్యక్షుడిగా పెద్దహరివాణం ఆదిశేషారెడ్డిని గురువారం టీడీపీ అధినాయత్వం నియమించింది. విజయవాడలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేతులమీదుగా ఆదిశేషారెడ్డి నియామక పత్రాన్ని అందుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు సహకారంతో తనను నియమించారని ఆదిశేషారెడ్డి అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తుఫాన్ బాధిత రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Updated Date - 2020-12-11T05:32:15+05:30 IST