మహాగౌరిగా భ్రమరాంబ
ABN, First Publish Date - 2020-10-25T17:03:16+05:30
నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం శ్రీశైల భ్రమరాంబ మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి..
కర్నూలు/మహానంది: నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం శ్రీశైల భ్రమరాంబ మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నంది వాహన సేవ నిర్వహించారు. కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహానందిలో కామేశ్వరీదేవి మహాగౌరిదుర్గ అలంకారంలో రావణవాహనంపై ఊరేగించారు.
నేడు విజయదశమి
జిల్లాలో విజయదశిమిని ఆదివారం జరుపుకోనున్నారు. ఈ ఏడాది మహార్ణవమి, విజయ దశమి ఒకే రోజున వచ్చాయి. కొత్త వస్త్రాలు ధరించి శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఇప్పటికే పలు దేవాలయాల్లో విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శనివారం కర్మాగారాల్లో, పోలీసుస్టేషన్లలో ఆయుధ పూజ చేశారు.
Updated Date - 2020-10-25T17:03:16+05:30 IST