అన్నదాన పథకానికి విరాళం
ABN, First Publish Date - 2020-12-01T05:54:01+05:30
శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సోమవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జూబ్లీహిల్స్కు చెందిన నారాయణరావు, శ్రీమతి సౌజన్య రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసుకు అందజేశారు.
శ్రీశైలం, నవంబరు 30: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సోమవారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జూబ్లీహిల్స్కు చెందిన నారాయణరావు, శ్రీమతి సౌజన్య రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసుకు అందజేశారు. కర్నూలుకు చెందిన ఎ.సరోజమ్మ రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకురాలు దేవికకు అందజేశారు. విశాఖపట్టణానికి చెందిన లేట్ ఎన్.అప్పన్న, ఎన్. అప్పయమ్మ పేర్లమీద ఎన్వీవీ సూర్యారావు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు శ్రీనివాసుకు అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్ర్తాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
Updated Date - 2020-12-01T05:54:01+05:30 IST