రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ABN, First Publish Date - 2020-11-25T06:19:41+05:30
పట్టణ సమీపంలోని బనగానపల్లి క్రాస్ రోడ్డు దగ్గర మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాదమ్మ(45) మహిళ మృతి చెందింది.
ప్యాపిలి, నవంబరు 24: పట్టణ సమీపంలోని బనగానపల్లి క్రాస్ రోడ్డు దగ్గర మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాదమ్మ(45) మహిళ మృతి చెందింది. దేవనకొండ మండలం బి కోటకొండ గ్రామానికి చెందిన మాదమ్మ తన కుమారుడు భాస్కర్ కలసి బైక్పై తుగ్గలి మండలంలో లంకాయపల్లేకు పెళ్లి చూపుల కోసం బయలు దేరారు. మార్గం మధ్యలోని ప్యాపిలి బనగానపల్లి క్రాస్ రోడ్డు దగ్గరకు రాగానే ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాదమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం డోన్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు భాస్కర్ పిర్యాదు మేరకు ఎస్ఐ మారుతి శంకర్ కేసు నమోదు చేశారు.
Updated Date - 2020-11-25T06:19:41+05:30 IST