ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ బదలాయింపు ఆపాలి

ABN, First Publish Date - 2020-11-29T05:19:05+05:30

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల కేటాయించవద్దని, ఈ భూమి బదలాయింపు జీవోను వెంటనే రద్దు చేయాలని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల నిరసన



నంద్యాల, నవంబరు 28: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల కేటాయించవద్దని, ఈ భూమి బదలాయింపు జీవోను వెంటనే రద్దు చేయాలని  ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు హెచ్చరించారు. వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములు ఇవ్వొద్దని శనివారం కార్మికులు చెవ్విలో పూలు పెట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మణ్‌, కార్యదర్శి ఏవీ రమణ అధ్యర్యంలో ఆందోళన జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 341ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్లకు విన్నవిస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు.  అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకొని నేరుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రాధాన్యతను వివరించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising